బ్రేకింగ్: విషమంగా వైసీపీ ఎమ్మెల్యే ఆరోగ్యం

-

ఆంధ్రప్రదేశ్ లో  అధికార పార్టీ నేతలను కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు 30 మంది ఎమ్మెల్యేలు వరకు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. పలువురు మంత్రులు కూడా కరోనా బారిన పడ్డారు. వారిలో దాదాపు కోలుకున్నా.రు అయితే కొంత మంది ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలుకనబడటంతో కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది .

coronavirus
coronavirus

ఆ తర్వాత నుంచి ఆయన కాకినాడ లో కరోనా వైరస్ కు చికిత్స తీసుకుంటున్నారు. ఈ రోజు ఆయన ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో అత్యవసరంగా బెంగళూరు తరలించాలి అని వైద్యులు సూచించారు .దీనితో అత్యవసర వైద్యం కోసం ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది అని తెలుస్తోంది .ఆయన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news