కలియుగ వైకుంఠం తిరుమలలో కొలువై ఉన్న శ్రీవారిని మంగళవారం తెల్లవారు జూమున ఇస్రో ఛైర్మన్ శివన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలసి ఆలయానికి చేరుకున్నారు. వారికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. జీశాట్-29 ఉపగ్రహం నమూనాను స్వామివారి పాదాలచెంత ఉంచి ప్రయోగం విజయవంతం కావాలని ఆశీస్సులు పొందారు. అనంతరం వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్
-
Previous article
Next article