బీజేపీ గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల..అందరికి కరోనా వ్యాక్సిన్‌ ఉచితం.

-

ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ బల్దియా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది..ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు..మొదట ముంబై దాడుల్లో అమరవీరులైన వారికి నివాళులర్పించారు కమలం నేతలు..ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ..తెలంగాణ ఆవిర్భావానికి సుదీర్ఘ కాలం పోరాటం చేసిన చరిత్ర ఉందన్నారు..తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర చాలా ఉందన్నారు..వచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన లేదని ఎద్దేవేశారు..బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించిందన్నారు..ప్రజలకు ఏం కావాలో మేం అర్థం చేసుకున్నామన్నారు..రాజ్యాంగాన్ని మోదీ సర్కార్‌ కాపాడుతోందని..గ్రేటర్‌లో గెలిపిస్తే సెప్టెంబర్‌ 17ని అధికారికంగా నిర్వహిస్తామని ఫడ్నవిస్‌ వెల్లడించారు.దీంతో పాటు ఇటీవలే భారీ వర్షాలతో వచ్చిన వరదల్లో నష్టపోయిన వారికి 25 వేలు సాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు..కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామన్నారు..ఎల్‌ఆర్‌ఎస్‌లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రేటర్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తామని..హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తామన్నారు..అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని..పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు..ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ కోసం హై క్వాలిటీ వైఫై..గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు..లక్ష మంది పేదలకు ప్రధాని ఆవాజ్‌ యోజన కింద ఇళ్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు..10వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామని..వచ్చే వర్షాకాలం నాటికి హైదరాబాద్ నాలాల పునరుద్ధరణ చేస్తామన్నారు..మహిళల కోసం ఐదేళ్లలో 15 కొత్త మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు..ఎస్సీ కాలనీలు, బస్తీ వాసులకు ఆస్తిపన్ను రద్దు చేయడంతో పాటు..125 గజాలలోపు ఇళ్ల నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తామని బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news