అద్దె ఇంట్లో ఆ వ్యాపారాన్ని సాగించాడు..?

-

అద్దెకు తీసుకున్న ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా ఓ వ్యక్తి వ్యభిచారాన్ని సాగించి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. టాన్స్‌ఫోర్స్‌ సీఐ చంద్రమౌళి వివరాల ప్రకారం.. ఉట్నూర్‌ మండలం గంగన్నపేటకు చెందిన పిండి మల్లికార్జున్, గత కొన్ని రోజులుగా ఆదిలాబాద్‌ పట్టణంలోని టీచర్స్‌ కాలనీలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వ్యభిచార వ్యపారాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో విశ్వాసనీయా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ సీఐ పురుషోత్తంతో కలిసి ఆ ఇంటిపై దాడులు చేసి ఓ మహిళ, నిర్వాహకుడు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.7700 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, డైరీలు స్వాధీనం చేసుకున్నారు.

ఓ ఉన్నతస్థాయి ఉద్యోగంలో విరమణ చేసిన మల్లికార్జున్‌ కొంతకాలంగా నిస్సహాయులైన మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దాడుల్లో పాల్గొన్న పోలీస్‌ అధికారులు ఎస్‌కే తాజొద్దీన్, ఏఎస్సై గంగాధర్, జగన్‌సింగ్, రహాత్, సరిత, మౌనికలనున ఉన్నతాధికారుల అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news