విజయసాయి మీద లోకేష్ ఘాటు వ్యాఖ్యలు.. మొరుగుతున్నారట !

-

విజయసాయి రెడ్డి మీద నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి రామతీర్ధంలో రాముల వారి ఆలయ విగ్రహ ద్వంసంకి సంబంధించి లోకేశ్, చంద్రబాబు కుట్ర ఉందని నిన్న విజయసాయి రెడ్డి ఆరోపించారు. వీరే ఆలయాలపై దాడులు చేయిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి నిన్న ట్విట్టర్‌లో స్పందించిన లోకేశ్‌… సీఎం జగన్‌కు లోకేశ్ సవాల్ విసిరారు. తనపై చేస్తున్న ఆరోపణలు అబద్దమని దేవుడి ఎదుట ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు. జగన్ ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. జగన్‌కు దమ్ముంటే సింహాచలం ఆలయానికి రావాలని సవాల్ చేశారు.

దానికి ఈరోజు రామతీర్థంలో పర్యటించిన విజయసాయి రెడ్డి ప్రమాణానికి తాను సిద్దమని అన్నారు. దానికి లోకేష్ ఘాటుగా స్పందించారు. నేను 420 జగన్ రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి? ఏ1కి దమ్మూ, ధైర్యం లేదా? దైవం మీద ప్రమాణం అనగానే తోకముడిచి చర్చ అంటూ పారిపోతున్నారు. ఇక్కడే తేలిపోయింది నాపై వైకాపా చేసే ఆరోపణల్లో బురద రాజకీయం తప్ప నిజం లేదని అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలానే ఈరోజు మరో సవాల్  నాపై జగన్ రెడ్డి చేస్తున్న,చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవం అని సింహాద్రి అప్పన్న పై ప్రమాణం చెయ్యడానికి సిద్ధం మరో వైఎస్ జగన్ సిద్ధమా? అంటూ ట్వీట్ చేశారు లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news