‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కి ప్రధాని మోడీ శ్రీకారం !

-

దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. గుజరాత్ లో ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని ప్రధాని మోడీ సందర్శించారు. సబర్మతి ఆశ్రమం నుంచి దండి దాకా 241 కిలోమీటర్ల మీరా జరగనున్న పాదయాత్రను మోడీ ప్రారంభించారు. ఈ పాదయాత్ర ఏప్రిల్ 5న దండిలో ముగియనుంది. మరో పక్క దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ని జరుపుతున్నారు.

తెలంగాణలో కూడా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ ప్రపంచానికే ఆదర్శం అని కేసీఆర్ పేర్కొన్నారు. అహింసా పద్ధతిలో మహాత్ముడు పోరాటం చేశారు, ఆయన స్వతంత్ర ఉద్యమానికి నేతృత్వం వహించిన తరువాత చాలా మార్పులు వచ్చాయని కేసీఆర్ పేర్కొన్నారు. వరంగల్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ పాల్గొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news