బెంగళూర్ వెళుతున్నారా ? ఇక ఆ సర్టిఫికెట్ కంపల్సరీ !

-

ఏప్రిల్ 1 నుంచి ఏ రాష్ట్రం నుంచి బెంగళూరుకు వస్తున్నా, ఆ ప్రయాణికులందరూ కరోనావైరస్ టెస్ట్ (ఆర్టీ-పీసీఆర్) నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకు రావాల్సి ఉంటుందని అన్నారు. కర్ణాటక ఆరోగ్య, వైద్య విద్యాశాఖ మంత్రి కె సుధాకర్ ఈ మేరకు ప్రకటించారు.

coronavirus
coronavirus

బెంగళూర్ నగరంలో కోవిడ్ -19 నియంత్రణ చర్యలు సమీక్షించడానికి సమావేశం నిర్వహించిన కర్ణాటక ఆరోగ్య మంత్రి, కరోనా సోకిన వ్యక్తుల చేతి మీద ముద్రించాలని ఇలా చేస్తే బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) లో నివసిస్తున్న వైరస్‌కు గురైన వారిని వేరు చేయడానికి వీలు ఉంటుందని తెలిపారు. బెంగళూరులో బుధవారం నాడు దాదాపు 1,400 కేసులు నమోదయ్యాయి, ఇది గత 4 నెలల్లో ఇవె అత్యధిక కేసులు. ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణీకులతో కేసులు ఎక్కువ అవుతున్నాయని చెబుతున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news