విశాఖలో దారుణం : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం

-

ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మధురవాడ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మధురవాడ లోని ఆదిత్య ఫార్చున్ టవర్ లోని ఫ్లాట్ నెంబర్ 505 అపార్ట్మెంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం అయ్యారు.

మృతులు బంగారునాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్ లుగా పోలీసులు గుర్తించారు. మంటల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం కావడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇది ఆత్మహత్యా, లేక ఎవరైనా కావాలని చేశారా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తామని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news