ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో 100 కోట్ల డ్రగ్స్ సీజ్ ?

-

 ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టి వేశారు.  జోహన్నెస్బర్గ్ నుంచి ఢిల్లీ వచ్చిన ఇద్దరు స్మగ్లర్ల వద్ద 98 కోట్ల విలువ చేసే హెరాయిన్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.    ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి 14 కేజీల డ్రగ్స్ ను తరలించే ప్రయత్నం చేసిన కేటుగాళ్లు దొరికిపోయారు.

డ్రగ్స్ ను లగేజ్ బ్యాగ్ లో దాచి గ్రీన్ ఛానెల్ ద్వారా బయటకు చెక్కేసే యత్నం చేశారు కేటుగాళ్లు. ఇద్దరినీ అడ్డగించిన కస్టమ్స్ అధికారులు వారి లగేజ్ బ్యాగ్ ను స్కానింగ్ చేయగా డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు బయట పడింది. ఈ ఇద్దరిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news