నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం…

-

హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన నార్సింగ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన స్టోన్ క్రషర్ వాహనం ఎదురుగా వస్తున్న టాటాఎస్ వాహనంతో పాటు అక్కడే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకోట్టడంతో వాహనంలోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు, కరెంటు వైర్లు ఒక్క సారిగా తెగిపోవడంతో కొద్ది సేపు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. చనిపోయిన వారిలో ఇద్దరిని వట్టినాగుల పల్లికి చెందిన హేమంత్ రెడ్డి, అనిల్ గా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదానికి అతివేగంతో పాటు మద్యపానం సేవించి క్రషర్ని నడపడమే కారణమని తెలుస్తోంది. ఘటన స్థలానికి  చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news