గడ్డి పోస కాదు నేను గడ్డపార..ఖబర్ధార్ : కెసిఆర్ కు ఈటల వార్నింగ్

-

వరంగల్ అర్బన్ జిల్లా : కమలాపూర్ మండలంలో శంబునిపల్లి గ్రామంలో ఇవాళ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పై మరోసారి ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్క పార్టీ పట్ల వివక్ష లేకుండా అందరి జెండాలు పెట్టడానికి అవకాశం ఉంటుందని… కానీ ఇప్పుడు కెసిఆర్ నీచపు సంస్కృతి మొదలు పెట్టారని మండిపడ్డారు. తన నియోజక వర్గంలో ప్రజల మధ్య గొడవలు లేవని… ఎవరికి ఏ అవసరం వచ్చినా మానవత్వంతో స్పందించిన వాడిని తానని పేర్కొన్నారు ఈటల.

“నన్ను గడ్డి పోస అనుకున్నాడు కెసిఆర్.. కానీ గడ్డపార అయ్యాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఖబర్ధార్” అంటూ సిఎం కెసిఆర్ కు ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. ధీరుడు కొట్లడతాడు.. రండ వెన్నుపోటు పొడుస్తాడని నిప్పులు చెరిగారు. 3 ఎకరాల భూమి ఇవ్వకుండా మోసం చేసి.. 10 లక్షలు స్కీమ్ తీసు కొచ్చాడని ఫైర్ అయ్యారు ఈటల. సిఎం కెసిఆర్ కు పుకట్ కి వచ్చిన డబ్బులు పంచిపెడుతున్నాడని మండిపడ్డ ఈటల.. ఆ డబ్బులను తీసుకోని.. ఓటు మాత్రం తనకు వేయలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news