బోర్డర్ వార్…. అస్సాం సీఎంపై హత్యాయత్నం కేసు నమోదు

-

మిజోరాం: అస్సాం, మిజోరాం మధ్య బోర్డర్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులో తలెత్తిన వివాదంతో మిజోరాంకు చెందిన పోలీసులు మృతి చెందారు. దీంతో మిజోరం ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తమ రాష్ట్ర పోలీసుల మృతి కారకులపై చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు అస్సాం సీఎం బిశ్వ శర్మతో పాటు ఆరుగురు ఉన్నాతాధికారులపై కేసులు నమోదు చేసింది. కొలసిస్ జిల్లా వైరంటేగ్ పోలీస్ స్థేషన్ పరిధిలో గతవారం అస్సాం, మిజోరాం పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు బాధ్యులుగా అస్సా డీజీపీ అగర్వాల్, డీఐజీ దేవజ్యోత్ ముఖర్జీ, కాచర్ ఎస్సై చంద్రకాంత్, ధోలియా పోలీస్ స్టేషన్ ఇంఛార్జీ సాహెబ్ ఉదిన్‌పై వైరంటేగ్ పోలీస్ స్టేషన్‌‌లో అస్సా సీఎంపై పోలీసు కేసులు దాఖలు చేశారు. ఐపీసీ 320,120-బీ, 270,352, 326, 353, 336, 348, 334 సెక్షన్ల కింది కేసులు నమోదు చేశారు. వీరిందరికి సమన్లు జరీ చేశారు. ఆగస్టు 1న తమ ఎదుట హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు.

కాగా ఇరు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఈ వివాదం మరింత ముదిరి కాల్పుల వరకూ వెళ్లింది. ఆరుగంటల పాటు అస్సాం, మిజోరం పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలో మిజోరం కు చెందిన ఆరుగు పోలీసులు మృతి చెందారు. మరో 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news