ఏపీ మ‌ద్యంలో ఈ డ్ర‌గ్స్ నే వాడుతున్నారు : బోండా ఉమా

-

ఏపీలో హెరాయిన్ స‌ర‌ఫరా అవుతుంద‌ని టీడీపీ నేత‌లు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని పేర్నినాని మండిపడ్డ సంగ‌తి తెలిసిందే. కాగా దీనిపై టీడీపీ నేత బోండా ఉమా స్పందించారు. ఏపీలో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా పోలీసుల‌కు తెలిసే జ‌రుగుతుందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతే కాకుండా రాష్ట్రంలో డ్ర‌గ్స్ దందాపై విచార‌ణ జ‌రింపిచాల‌ని తాము డీఆర్ఐకి లేఖ రాస్తామ‌ని బోండా ఉమా వెల్ల‌డించారు. అంతే కాకుండా రాష్ట్రంలో త‌యారు అవుతున్న మ‌ద్యంలో ఇవే డ్ర‌గ్స్ ను వాడుతున్నారంటూ ఉమా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

డ్ర‌గ్స్ దందాలో తాడేప‌ల్లి ప్యాలెస్ కు ఎంత వెళ్లిందంటూ సీఎంను ఉద్ద్యేశించి ఉమా వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు తోనే డ్ర‌గ్స్ దిగిమ‌తి జ‌రుగుతోందని ఉమా ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతోంది. అక‌స్మాత్తుగా నిన్న మంత్రి పేర్నినాని మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారని గుమ్మ‌డికాయ‌ల దొంగ ఎవ‌రంటే భుజాలు తడుముకుంటున్నారని అన్నారు. డ్ర‌గ్స్ దందాపై ఎందుకు విచార‌ణ జ‌రప‌డం లేద‌ని…డీజీపీ ఏం చేస్తున్నారని బోండా ఉమా ప్ర‌శ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news