అభిమానుల ప్రార్థ‌న‌లు ఫ‌లించాయి…తేజ్ ఆరోగ్యంపై త‌మ‌న్..!

-

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. తేజ్ బైక్ పై నుండి పడిపోవ‌డంతో అత‌డి కాల‌ర్ బోన్ ఫ్యాక్చ‌ర్ అయ్యింది. దాంతో అత‌డికి అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స అందించారు. కాల‌ర్ బోన్ కు స‌ర్జ‌రీ చేశారు. అయితే స‌ర్జ‌రీ అనంత‌రం తేజ్ ను అభిమానుల‌ను చూడ‌లేదు. దాంతో అభిమానులు తేజ్ ఆరోగ్యం ప‌ట్ల ఆందోళ‌న చెందుతున్నారు.

కాగా ఇటీవ‌ల రిప‌బ్లిక్ సినిమా ఈవెంట్ లో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యంపై ద‌ర్శ‌కుడు దేవ క‌ట్టా స్పందించారు. ఈవెంట్ ను తేజ్ ఆస్ప‌త్రిలో వీక్షిస్తున్నాడ‌ని చెప్పారు. కాగా తాజాగా సంగీత దర్శకుడు త‌మ‌న్ కూడా తేజ్ ఆరోగ్యంపై స్పందించారు. నా మిత్రుడు సాయిని క‌ల‌వ‌బోతుండ‌టం ఎంతో ఆనందంగా ఉంది. లవ్ యూ సాయి అభిమానుల ప్రార్థ‌న‌లు ఫ‌లించాయి. అంటూ త‌మ‌న్ పేర్కొన్నారు. త‌మ‌న్ త‌న ట్వీట్ తో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news