హైదరాబాద్‌ లో రోడ్డు ప్రమాదం..షేక్‌పేట్ ఫ్లైఓవర్ నుంచి పడి యువకుడు మృతి

-

హైదరాబాద్‌ మహా నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ లోని షేక్‌పేట్ ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జి పై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ఫ్లై ఓవర్ పై బైక్‌ను ఢీ కొట్టింది. ఈ నేపథ్యంలో… ఫ్లై ఓవర్ పై నుంచి బైక్ తో సహా యువకుడు కింద పడిపోయాడు. బ్రిడ్జి పై బైక్‌ నడుపుతున్న వ్యక్తి.. వంతెనపై నుండి పడిపోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

దీంతో ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.

అయితే.. ఈ షేక్‌పేట్ ఫ్లైఓవర్ ప్రమాదంలో కారు డ్రైవర్‌ దే తప్పిదని… వాహనదారులు చెబుతున్నారు. అతి వేగంగా కారు డ్రైవ్‌ చేయడం కారణంగానే… ఈ రోడ్డు ప్రమాద చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు వాహనదారులు. ఇక దీనిపై త్వరలోనే వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news