Breaking : సిద్ధిపేట్ జిల్లాలో కాల్పుల క‌ల‌క‌లం

-

తెలంగాణ‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో సిద్ధిపేట్ జిల్లా ప్ర‌థ‌మ స్థానంలో ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్ రావు ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర ప‌థ‌కాలు గానీ, అభివృద్ధి ప‌నులు గాని మొద‌ట సిద్ధిపేట్ జిల్లాలోనే జ‌రుగుతున్నాయి. కాగ అలాంటి జిల్లాల్లో కాసేప‌టి క్రితం కాల్పులు చోటు చేసుకున్నాయి. సిద్ధిపేట్ లో చోటు చేసుకున్న కాల్పుల క‌ల‌క‌లం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్నాయి.

కాగ సిద్ధిపేట్ జిల్లాలోని తొగుట మండ‌లంలో గ‌ల రాంపూర్ గ్రామ శివారులో ఈ కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పులు ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. తిరుప‌తి, వంశీ అనే వ్యక్తుల మధ్య ఈ కాల్పులు చోటు చేసుకున్న‌ట్టు స‌మాచారం. కాగ ఈ ఇద్ద‌రు కూడా.. సిద్ధిపేట్ జిల్లాలోని దుబ్బాక మండ‌లం చెల్లాపూర్ అనే ఒక గ్రామానికి చెందిన వార‌ని తెలుస్తుంది. వీరి ఇద్ద‌రి మ‌ధ్య గ‌త కొద్ది రోజుల నుంచి భూ వివాదం జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. ఈ భూ వివాదం ముదిరి.. ఒక‌రి పై ఒక‌రు కాల్పులు జ‌రుపుకున్న‌ట్టు స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news