రామ్ చరణ్, తారక్‌తో రాఖీ సవంత్.. RRR సెలబ్రేషన్స్‌లో ఐటెం బాంబ్ సందడి..

-

మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన RRR రూ.1,000 కోట్ల క్లబ్ లోకి చేరింది. హిందీ ఇండస్ట్రీలో రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. కాగా, ఈ చిత్ర సెలబ్రేషన్స్ ను ఇటీవల ముంబైలో నిర్వహించారు. హీరోలు రామ్ చరణ్, తారక్, డైరెక్టర్ రాజమౌళి, ప్రొడ్యూసర్ దానయ్య, సినీ ప్రముఖులు, బీ టౌన్ ప్రముఖులు, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, జావిద్ అక్తర్ తదితరులు సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేశారు.

RRR సెలబ్రేషన్స్ లో బాలీవుడ్ హాట్ గర్ల్ అండ్ ఐటెం బాంబ్ రాఖీ సవంత్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సెలబ్రేషన్స్ లో ‘నాటు నాటు ’ స్టెప్స్ వేసిన ఈ భామ..తన ఫేవరెట్ హీరో రామ్ చరణ్ ను కలిశానని చెప్పింది. తారక్ తోనూ ముచ్చటించిన ఈ సుందరి.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అది నెట్టింట తెగ వైరలవుతోంది. రాఖీ సవంత్ అలా హ్యాపీగా రామ్ చరణ్, తారక్ లతో ముచ్చటిస్తుండగా అది చూసి వావ్ అంటున్నారు నెటిజన్లు.

రాజమౌళి తెరకెక్కించిన ఈ విజ్యువల్ వండర్ RRR ను ఉత్తరాదిలో పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎం.ఎం.కీరవాణి అందించిన సంగీతం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడిగా రాజమౌళి పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా సినీ ప్రముఖులు అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో తారక్, రామ్ చరణ్ లు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారని చెప్పొచ్చు.

https://www.instagram.com/reel/CcDL377BiYn/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news