తెలంగాణలో నేడు కొత్త‌గా 29 క‌రోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుతుంది. రాష్ట్రంలో ప్ర‌తి రోజు కూడా 30 కంటే త‌క్కువ పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. కాగ ఈ రోజు రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగాయి. నేటి కరోనా వైర‌స్ బులిటెన్ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఈ కరోనా బులిటెన్ ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 29 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

కాగ నిన్న తెలంగాణ రాష్ట్రంలో 22 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అంటే నిన్న‌తో పోలిస్తే ఈ రోజు రాష్ట్రంలో 7 కేసులు పెరిగాయి. అలాగే ఈ రోజు రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ లేదు. కాగ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది క‌రోనా వైర‌స్ బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 249 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌.. 16,388 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news