నేటి నుంచి యాదాద్రిలో పార్కింగ్ బాదుడు.. గంటకు 500..

-

పునర్నిర్మాణం చేసుకున్న యాదాద్రీశ్వరుడిని దర్శించుకోవాలని భారీ సంఖ్యలో భక్తులు యాదాద్రికి క్యూ కడుతున్నారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట కొండపైకి వాహనాలను అనుమతించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. పార్కింగ్ చార్జీల మోత మోగించింది. వాహన దారుల నుంచి పార్కింగ్ ఫీజుల రూపంలో భారీగా దండుకుంటున్నారు. యాదగిరిగుట్టపై అడ్డగోలుగా పార్కింగ్‌ వసూళ్ల పై ఇక్కడికి వస్తున్న భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Yadadri #YADAGIRIGUTTA - యాదగిరిగుట్ట: Parking at tulasi cottage

కొండపై వాహనం పార్క్‌ చేస్తే గంటకు రూ.500 చార్జీ చేస్తున్నారు. గంట దాటితే అదనంగా రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. కొండపైకి వాహనాలను అనుమతించడంతో ఎంతో సంతోషంగా వాహన దారులు తమ వాహనాలతో గుట్టపైకి వస్తున్నారు. తీరా పార్కింగ్‌ పేరిట బాదుడు చూసి షాక్ కు గురవుతున్నారు. నేటి నుంచి నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. కాగా, ప్రొటోకాల్, దాతల వాహనాలకు ఈ రుసుం నుంచి మినహాయింపు కల్పించారు. ఆదివారాలు, సెలవు దినాల్లో భారీ సంఖ్యలో భక్తులు యాదగిరి నరసింహుడిని దర్శించుకునేందుకు వస్తుంటారు. చాలా మంది తమ సొంతవాహనాలపై వస్తుంటారు. అలా వచ్చినవారి నుంచి పార్కింగ్ చార్జీలపేరుతో దోపిడీ చేయడం పై భక్తులు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news