కామంతో కళ్లుమూసుకుపోయి.. మహిళపై అత్యాచారం హత్య..

-

చట్టాలు, పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు వేసినా.. మృగాళ్లు మాత్రం మారడం లేదు.. తమ కామ వాంఛ తీర్చుకోవడానికి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా.. ఆఖరికి పశువులపై కూడ అఘాయిత్యాలు పాల్పడుతున్నారు. అయితే రోజుకో చోట అత్యాచారం ఘటనలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. తాజా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుప్రాన్‌పేటలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నాగర్‌ కర్నూలు జిల్లా కోడూరు మండలం కర్రెన్నబండ తండాకు చెందిన కృష్ణ నాయక్‌, లావణ్య కొన్నాళ్ల కిందట వలస వచ్చారు. సెక్యురిటీ గార్డ్‌గా పని చేస్తున్న భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో.. ఇంట్లో ఒంటరిగా ఉన్న లావణ్యను టార్గెట్ చేసి అత్యాచారం చేశారు.

ఆపై లావణ్యను హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. తలపై బలంగా కర్రతో కొట్టడంతో ఆమె స్పాట్‌లోనే చనిపోయిందని పోలీసులు తెలిపారు. తూప్రాన్‌పేటలో సెక్యూరిటీగా గార్డుగా పనిచేస్తున్న భర్త విధులకు వెళ్లిన టైమ్‌లో.. ఆమెపై దాడి చేసి, అత్యాచారం చేసి చంపేశారని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news