చంద్రబాబును ముసలోడు అంటున్నారు..టీడీపీపై జేసీ సంచలన వ్యాఖ్యలు

-

కార్యకర్తలు కదిలిరంది… చంద్రబాబు ను సీఎంను చేయండని జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. టీడీపీ, వైసీపీ ఒకటే విధానాం లో పోతున్నాయని.. గడప గడప కు ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యే లు పల్లెలు తిరుగుతున్నారని పేర్కొన్నారు. వాలంటీర్ ను వెంటబెట్టుకొని వెళుతున్నారు. జగనన్న ను దీవించండి అని అడుగుతున్నారని.. ఆ పార్టీకి ఈ రోజు కార్యకర్తలు లేరు…అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్యేల వెంబడి సచివాలయం సిబ్బంది, అధికారులు, పోలీసులు వెళుతున్నారు… ఓ ఎంపీ ప్రజల పల్స్ పట్టుకోవాలి…. టీడీపీ వాళ్ళను లాక్కురండి అని వాలంటీర్ ల తో అంటున్నారన్నారు. చంద్రబాబు ను ముసలోడు అంటున్నారు. ఆయన బయట తిరుగుతున్నాడు.నువ్వు ఎవరో తెలియదు.

సీఎం వస్తున్నాడు అంటే షాపులు ముయ్యాలి… ఆరు వందల మంది పోలీసులు ఉండాలని వెల్లడించారు. ముసలోడు అయినా చంద్రబాబును జనం మాత్రం మేలు అనుకుంటున్నారన్నారు. పోలీసు అనే మహా వృక్షం కింద వై ఎస్ ఆర్ ఉంది. ఆ పార్టీ పై కార్యకర్తల్లో ద్వేషం చాలా ఉందని.. మనం మూడేళ్లు ఇళ్లల్లో కూర్చున్నామని పేర్కొన్నారు. అధికారం లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేశారు.. అనంతరం కార్యకర్తలను మరిచామని.. మనం చంద్రబాబు ను సీఎం ను చేసుకోవాలి. అందుకోసం జైలుకు వెళ్ళడానికి సిద్ధమని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news