జూలై 8న దిల్ రాజు లోటు తీరనుందా..ఏమిటంటే..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు దిల్ రాజు.. నిర్మాతగా 2003లో ఆయన కెరియర్ ప్రారంభమైంది. ఇక తక్కువ కాలంలోనే బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తూ బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాడు. భవిష్యత్తులో తన బ్యానర్ నుంచి బాహుబలి, కేజిఎఫ్ వంటి బడా రేంజ్ ప్రాజెక్టులను కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెబుతున్నాడు. ఇక పోతే ఎంత ఎదిగినా. ఎన్ని బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్నా కూడా దిల్ రాజుకు కొంతకాలంగా ఒక లోటు బాగా వెంటాడుతూ వస్తోందట. ఆ లోటు జూలై 8 వ తేదీన తీరిపోతుందని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు దిల్ రాజు.Two Months Of Pan-India Hungama For Dil Raju

దిల్ రాజుకు ఎంతో కాలంగా ఉండిపోయిన ఆ లోటు ఏమిటంటే సుమారుగా 12 సంవత్సరాల క్రితం దిల్ రాజు బ్యానర్లో వచ్చిన జోష్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. దిల్ రాజు నిర్మాతగా ఆర్య , భద్ర, దిల్, బొమ్మరిల్లు లాంటి సినిమాలతో వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. నాగచైతన్య మొదటి సినిమా బాధ్యతను కూడా దిల్ రాజు చేతిలో పెట్టారు నాగార్జున. ఇక వాసువర్మ దర్శకత్వంలో వచ్చిన జోష్ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఇక అప్పటి నుంచి నాగచైతన్యతో మళ్ళీ సినిమా చేయలేదు దిల్ రాజు. అందుకు గల కారణం ఏమిటంటే రెండవసారి చైతన్యతో వర్క్ చేస్తే మాత్రం అతనికి తప్పకుండా బ్లాక్ బాస్టర్ ఇవ్వాలనే పట్టుదలతో దిల్ రాజు ఇంత కాలం ఎదురుచూస్తూ వచ్చాడు.Will Poles Apart Come Together Again?

మొత్తానికి అక్కినేని హీరోలకు మనం లాంటి క్లాసిక్ మూవీ అందించిన విక్రమ్ కుమార్.. దిల్ రాజు ఎదురు చూపులకు స్వస్తి పలికారు.. కేవలం నాగచైతన్య ని దృష్టిలో పెట్టుకొని రాసుకు వచ్చిన థాంక్యూ సినిమా కథ దిల్ రాజుకు బాగా నచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించారు . జూలై 8 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా.. ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న దిల్ రాజు కచ్చితంగా విజయం సాధిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ సినిమాతో నైనా దిల్ రాజు లోటు తీరుతుందో లేదో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news