ఇటలీలో దారుణం.. సముద్రపు ఒడ్డున్న కూర్చున్న భారత విద్యార్థిని లాకెళ్లిన..

-

ఇటలీలో హృదయవిదాకర ఘటన చోటు చేసుకుంది. ఏపీలోని కర్నూలులో స్థానిక బాలాజీనగర్‌లోని బాలాజీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న చిలుమూరు శ్రీనివాసరావు, శారద దంపతుల పెద్ద కుమారుడు దిలీప్ (24) ఇటలీలోని మిలాన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ అగ్రికల్చర్‌ చదువుతున్నాడు. 2019 సెప్టెంబరులో మిలాన్ వెళ్లిన దిలీప్ గతేడాది ఏప్రిల్‌లో కర్నూలు వచ్చాడు. సెప్టెంబరులో తిరిగి వెళ్లాడు దిలీప్. కోర్సు పూర్తి కావడంతో ఉద్యోగం సంపాదించి కర్నూలు వస్తానని ఇటీవల తల్లిదండ్రలకు ఫోన్ చేసి దిలీప్ చెప్పాడు. పీజీ పూర్తయిన సంతోషంలో శుక్రవారం మాంటెరుస్సో బీచ్‌కు దిలీప్ వెళ్లాడు.

Where to Find the Best Beaches in Cinque Terre, Italy - Travel Dudes

సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో ఏమరపాటున ఒడ్డున కూర్చున్న దిలీప్‌ను అలలు లాక్కెళ్లాయి. వెంటనే అప్రమత్తమైన కోస్టుగార్డు సిబ్బంది రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో దిలీప్ మృతదేహం లభ్యమైంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దిలీప్ భౌతికకాయాన్ని స్వదేశానికి తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దిలీప్ మరణంలో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news