మేనకోడలిపై కర్కశత్వం.. బెదిరించి పలుమార్లు అత్యాచారం..

-

ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు విధించిన కామాంధుల వెన్నులో మాత్రం వణుకు పుట్టడం లేదు. రోజు రోజుకు రెచ్చిపోతూ.. స్త్రీలపై ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అయితే..ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మేనకోడలిపైనే కన్నేసిన ఓ దుర్మార్గుడు.. బలవంతంగా ఆమెపై తన కామవాంఛ తీర్చుకున్నాడు.ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుందది. పోలీసులు కథనం ప్రకారం.. అంధేరీకి చెందిన 35 ఏళ్ల బాధిత మహిళపై 75 ఏళ్ల నిందితుడు తొలిసారి 2007లో ఓ హోటల్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత ముంబై సబర్బన్‌లో పలుచోట్ల అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోపాటు మరో కరుడుగట్టిన నేరస్థుడు కూడా తను బంధువేనని, విషయాన్ని బయటపెడితే వారితో చంపిస్తానని బెదిరించినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, తన నుంచి ఒక శాతం వడ్డీకి తీసుకున్న రెండుకోట్ల రూపాయల రుణాన్ని కూడా ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు తదుపరి దర్యాప్తు కోసం ఎంఐడీసీ పోలీసు స్టేషన్‌కు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news