చంద్రబాబు రింగ్ పై జగన్ సెటైర్లు.. వేళ్ళకి, కాళ్ళకి కాదు దానికి ఉండాలి

-

ఈమధ్య చంద్రబాబు చేతి వేళ్లకు పెట్టుకున్న రింగులో చిప్ వుందని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ.. చిప్ వేళ్ళకి, కాళ్ళకి ఉంటే సరిపోదు.. మెదడులో ఉండాలంటూ ఎద్దేవా చేశారు.” ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్ చంద్రబాబుకు లేదు. చంద్రబాబుకు ప్రజల పట్ల మమకారం, ప్రేమ అన్నది ఏమాత్రం లేదు. పేదల ఎదగకూడదన్నదే చంద్రబాబు, ప్రజలకు మంచి చేయకూడదన్నదే చంద్రబాబు అభిమతం.

తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు, పేదలకు మాత్రం తెలుగు మీడియం చదవాలంట. నారాయణ, చైతన్యలను మాత్రమే టిడిపి ప్రోత్సహిస్తుంది. కానీ మన ప్రభుత్వం ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడానికి శ్రమిస్తుంది. పద్నాలుగేళ్ల సీఎంగా చేసిన వ్యక్తి కుప్పం ను రెవెన్యూ డివిజన్ చేయడానికి అర్జీ పెట్టుకున్నారు. కుప్పం ను రెవెన్యూ డివిజన్ చేసింది మీ జగన్ ప్రభుత్వమే. టిడిపి అంటే పెత్తందారుల ద్వారా, పెత్తందార్ల కోసం నడుస్తున్న పార్టీ. చంద్రబాబు పార్టీ సిద్ధాంతమే వెన్నుపోట్లు” అని సీఎం జగన్ ప్రస్తావించారు.

Read more RELATED
Recommended to you

Latest news