జీవీఎల్‌.. చంద్రబాబుల మధ్య ఆసక్తికర సంభాషణ

-

నిన్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించిన విషయం తెలిసింది. అయితే.. అనూహ్యంగా.. టీడీపీ సైతం ఆమెకే మద్దుతు ఇస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఒకే వేదికపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూర్చున్నారు. అయితే.. ద్రౌపది ముర్ము వైసీపీ ప్రజాప్రతినిధులతో భేటీ అనంతరం, విజయవాడ తాజ్ గేట్ వే హోటల్లో టీడీపీ ప్రజాప్రతినిధులను కలిశారు. కాగా, ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ ఏపీ అగ్రనేతలు జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా, చంద్రబాబుతో జీవీఎల్ సరదాగా సంభాషించారు.

టీడీపీ అధినేతకు జీవీఎల్ సవాళ్లు...దమ్ముంటే మాట్లాడు

‘చంద్రబాబు గారూ మీరు బాగా బరువు తగ్గారు’ అంటూ జీవీఎల్ పేర్కొన్నారు. అందుకు చంద్రబాబు చమత్కారంగా బదులిచ్చారు. “అప్పట్లో 70 కేజీలకు పైబడి ఉంటే, ఇప్పుడు 60 కేజీలకు పైబడి ఉన్నా” అంటూ సరదాగా సమాధానమిచ్చారు చంద్రబాబు. దాంతో అక్కడ నవ్వులు విరబూశాయి. కాగా, తన ఏపీ పర్యటన ముగించుకున్న ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుప్రయాణమయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news