జమ్ముకశ్మీర్‌లో నదిలో పడిన వాహనం.. ఆరుగురు జవాన్లు మృతి

-

జవాన్లతో వెళ్తున్న వాహనం ఘోర ప్రమాదానికి గురైన ఘటన జమ్ముకశ్మీర్​లో చోటుచేసుకుంది. పహల్గామ్​లోని ఫ్రిస్లాన్ చందన్వారి రోడ్డు ప్రాంతంలో భద్రతా బలగాల వాహనం ప్రమాదానికి గురై నదిలో పడిపోయింది. బస్సు బ్రేకులు ఫెయిలవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


ఈ ఘటనలో ఆరుగురు ఐటీబీపీ జవాన్లు చనిపోయారు. 30 మంది సైనికులు గాయాల పాలయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

“మంగళవారం ఉదయం 39 మంది ఐటీబీపీ జవాన్లతో ప్రయాణిస్తున్న బస్సు.. బ్రేక్​లు ఫైయిల్​ అవ్వడం వల్ల పక్కన ఉన్న నదిలో పడిపోయింది. ఘటనాస్థలికి అధికారులు చేరుకున్నారు. బస్సులోని జవాన్లంతా అమర్​నాథ్​ యాత్రకు సంబంధించిన విధులు నిర్వర్తించి తిరిగి వస్తున్నారు” అని ఐటీబీపీ ఉన్నతాధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news