ఢీ వేదికపై కన్నీరు మున్నీరైన పూర్ణ.. అసలు విషయం తెలిస్తే షాక్..!

-

ప్రముఖ నటి అందాల తార పూర్ణ ఇటీవల బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ డాన్స్ కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . ప్రస్తుతం ఈ కార్యక్రమం 14వ సీజన్ ను జరుపుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి ఎంతోమంది కొరియోగ్రాఫర్లు, నటీమణులు జడ్జిలుగా వస్తూ వెళ్తూ ఉన్నారు. ఇక తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమో విడుదలవగా అందులో పూర్ణ, శ్రద్ధాదాస్ కంటతడి పెట్టుకోవడం మనం చూడవచ్చు.

ఇక ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే కంటెస్టెంట్లు కూడా తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో దుమ్ము దులిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఒక కంటెస్టెంట్ అమ్మ సెంటిమెంటుతో అక్కడున్న వారందరినీ పెద్ద ఎత్తున ఏడిపించేశాడు.. నిజానికి ఎక్కడున్నా సరే అమ్మ సెంటిమెంట్ 100% వర్క్ అవుట్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇలా అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఒక కంటెస్టెంట్ కూడా ఢీ వేదికపై అమ్మ సెంటిమెంటుతో పెర్ఫార్మన్స్ ఇచ్చి అందర్నీ ఏడిపించారు.

ఇక ఆ డాన్స్ పర్ఫామెన్స్ చూసిన పూర్ణ తట్టుకోలేక ఎమోషనల్ అవుతూ వేదిక పైకి వచ్చి ఒక్కసారిగా కన్నీరు మున్నీరయింది . ఇక శ్రద్ధ దాస్ సైతం గుండెలు పిండే పెర్ఫార్మెన్స్ చూసి ఆమె కన్నీటిని ధారలా పొంగించింది.. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. మరి పూర్తి ఎపిసోడ్ చూడాలి అంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే పూర్ణ ప్రస్తుతం త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఇక దాని తర్వాత ఆమె కార్యక్రమాలలో పాల్గొంటుందా లేక పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరం అవుతుందా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news