హైదరాబాద్ లో రేపు ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

-

గణేశ్ నిమజ్జనానికి భాగ్యనగరం ముస్తాబైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రేపు ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరిగేలా నగర పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గణపతి నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా అంగరంగ వైభవంగా జరిగేలా ప్రణాళిక రెడీ చేశారు.  రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ వెల్లడించారు.  ఎల్లుండి ఉదయం 10 గంటల కల్లా నిమజ్జన ప్రక్రియ ముగుస్తుందని ఆశిస్తున్నామని.. ఇప్పటికే ట్రాఫిక్‌ అడ్వయిజరీ జారీ చేసినట్టు తెలిపారు. నిమజ్జనోత్సవం సందర్భంగా అందరూ పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

హుస్సేన్‌ సాగర్‌లో రేపు దాదాపు 15వేలు నుంచి 20వేల విగ్రహాలు నిమజ్జనమవుతాయని అంచనా వేస్తున్నట్టు రంగనాథ్‌ తెలిపారు. విధుల్లో 3వేల మంది ట్రాఫిక్‌ సిబ్బంది ఉంటారన్నారు. సీసీటీవీ కెమెరాలు, మౌంటెడ్‌ వాహనాల పర్యవేక్షణలో, డ్రోన్‌తో నిమజ్జన శోభాయాత్రను షూట్‌చేస్తామన్నారు. ఇతర వాహనాల కోసం ప్రత్యామ్నాయ రూట్‌లను సూచించామని తెలిపారు.

ఈ నిమజ్జనోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చేవారి కోసం ప్రత్యేక పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్టు రంగనాథ్ వివరించారు. ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 9.30గంటల మధ్య ప్రారంభమై.. మధ్యాహ్నం 1గంట కల్లా ఎన్టీఆర్‌మార్గ్‌ వైపు నిమజ్జనం జరిగే అవకాశం ఉన్నట్టు రంగనాథ్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news