నేడు ఎన్టీఆర్ స్టేడియంలో లక్షమందితో కేసీఆర్ బహిరంగ సభ

-

సెప్టెంబర్ 17న హైదరాబాద్ ప్రాంతం భారత యూనియన్‌లో చేరిన సందర్భంగా ఇవాళ ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని’ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజధాని హైదరాబాద్‌లో ప్రధాన కార్యక్రమం జరగనుంది. అయితే… తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఇవాళ ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకానున్నారు.

ఈ సభకు దాదాపు లక్ష మంది రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఎన్టీఆర్‌ స్టేడియం పరిసరాల్లో 17వ తేదీ మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటుందని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంకు వచ్చే చుట్టూ పక్కల మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమ‌ల్లో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. అటు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సెలవు ప్రకటించింది. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నేడు సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news