BREAKING : అమిత్ షాకు తప్పిన పెను ప్రమాదం !

-

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి.ఈ కార్యక్రమానికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి.. హరితా ప్లాజాకు చేరుకున్నారు హోం మంత్రి అమిత్ షా.

ఈ నేపథ్యంలోనే.. హరిత ప్లాజా వద్ద అమిత్ షా కన్వాయ్ కి అడ్డొచ్చింది ఓ గుర్తు తెలియని వ్యక్తి కారు. అమిత్‌ షా కాన్వాయ్‌ వచ్చినా… అతను కారు పక్కకి తీయకపోవడంతో.. బ్యాక్ అద్దం పగలగొట్టింది అమిత్ షా భద్రత సిబ్బంది. అయితే.. ఆ వ్యక్తి ఎందుకు అలా చేశాడో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం హరిత ప్లాజా లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news