పటేల్ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు..ఆయనకు దండ వేసే హక్కు బీజేపీకి లేదు – రేవంత్

-

RSS ను నిషేధించిందే సర్ధార్‌ పటేల్ అని..ఆయనకు దండ వేసే హక్కు బీజేపీకి లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీ భవన్‌ లో జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ల విగ్రహానికి నివాళి అర్పించారు రేవంత్, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నాల. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగరేసిన రేవంత్… మీడియాతో మాట్లాడారు.

గాంధీ భవన్ పునాదులు వేసిందే వల్లభాయ్ పటేల్ అని… తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. వల్లభాయ్ పటేల్ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుడని… Rss నీ నిషేధించింది వల్లభాయి పటేల్ అని వెల్లడించారు.

మీ మూలాలు నిషేధించింది వల్లభాయ్ పటేల్.. ఆయన విగ్రహానికి దండ వేయడానికి బీజేపీ కి హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ముస్లిం హిందువుల మధ్య చిచ్చే పెట్టే బీజేపీ అని… గుజరాత్ నుండి కొందరు దేశ దిమ్మరులు హైదబాద్ వచ్చారని ఆగ్రహించారు.మోడీ ఆదేశాలతో హైదరాబాద్ వచ్చారా.. మీకు మీరే వచ్చారా..? మోడీ చెప్తే వచ్చేది నిజం అయితే… నిజాం సంస్థానం కూడా దేశం లో విలీనం అవ్వడానికి నెహ్రూ ఆదేశం మేరకు వల్లభాయ్ పటేల్ విలీనం చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news