ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆంధ్రప్రభ ఎండికి ఈడీ నోటీసులు

-

ఢిల్లీ లిక్కర్ స్కాం లో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్, ఢిల్లీ, పంజాబ్ లోని పలు ప్రాంతాలలో మరోసారి దాడులు నిర్వహించాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న విజయ్ నాయిర్ ను ఇప్పటికే అరెస్టు చేయగా.. హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును ఆదివారం రాత్రి అరెస్టు చేసి సిబిఐ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అభిషేక్ రావు కు మూడు రోజుల కస్టడీ విధించింది.

తాజాగా లిక్కర్ స్కాం లో భాగంగా ఆంధ్రప్రభ, ఇండియా అహెడ్ ఎండి ముత్తా గోపాలకృష్ణకు ఈడి నోటీసులు జారీ చేసింది. నేడు విచారణకు హాజరుకావాలనిి ఆదేశించింది. ఢిల్లీ ఈడి కార్యాలయంలో విచారణ జరగనుంది. ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన అర్జున్ పాండే, అభిషేక్ తో గోపాలకృష్ణకు ఉన్న సంబంధం నేపథ్యంలో ఈడీ ఆయనను ప్రశ్నించనుంది. ఇప్పటికే ఆంధ్రప్రభ దినపత్రిక కార్యాలయంలో ఈడి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news