ఏపీ పెన్షనర్లు, ఉద్యోగులకు శుభవార్త..మెడికల్ రీ-ఇంబర్స్మెంట్ స్కీమును పొడిగింపు

-

ఏపీ ఉద్యోగులకు జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. మెడికల్ రీ-ఇంబర్స్మెంట్ స్కీమును పొడిగింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ఉద్యోగులకు మెడికల్ రీ-ఇంబర్స్మెంట్ స్కీమును పొడిగిస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్‌.

2022 ఆగస్టు 1 తేదీ నుంచి 2023 మార్చి 31వ తేదీ వరకూ స్కీమును కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం. ఉద్యోగులతో పాటు పెన్షనర్లకూ మెడికల్ రీ ఇంబర్సుమెంట్ పథకాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హెచ్ఎస్ కు అనుబంధంగా ఈ పథకం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక తాజాగా జగన్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులు పెన్షన్లర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news