మునుగోడు ఉప ఎన్నిక నుంచి తప్పుకుంటాం – KTR ఛాలెంజ్‌

-

మంత్రి కేటీఆర్‌… బీజేపీకి బహిరంగ సవాల్‌ విసిరారు. మునుగోడు ఉపఎన్నిక ఒక కాంట్రాక్టర్ అహంకారం, బలుపు వల్ల వచ్చిందని ఆగ్రహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్తున్నా మా మంత్రి జగదీశ్ రెడ్డి ఛాలెంజ్ కు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. మునుగోడు కు కేంద్రం 18వేల కోట్ల నిధులు ఇస్తే ఉప ఎన్నిక నుండి తప్పుకుంటామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్‌.

కేసీఆర్ మునుగోడు కు ఏమి చేశాడు అన్న సన్నసులకు చెప్పాలిసిన అవసరం ఉందని.. ఇటీవలే కేంద్రము అవార్డులు ఇస్తే…చండూరు మునిసిపాలిటీకి అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచే చేసాం… ఎవరికి చెడు చేయలేదని తెలిపారు కేటీఆర్‌. తెలంగాణ విషయంలో మోడీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని… గుజరాత్ మాడల్…బేకర్ మాడల్ అని నిప్పులు చెరిగారు కేటీఆర్‌. తెలంగాణ లోని పక్క రాష్ట్రల వాళ్ళు తమని కలపాలని అడుగుతున్నారని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news