హైదరాబాద్‌ లో తాలిబన్ల పాలన..RGV సంచలన వ్యాఖ్యలు

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదిక గా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు. అయితే.. తాజాగా హైదరాబాద్‌ పబ్‌లు, హైదరాబాద్‌ పోలీసులపై విరుచుకుపడ్డారు.

అన్ని రాష్ట్రాలు, దేశాల్లో రాత్రి 1 గంటల వరకు పబ్‌ లు తెరిచి ఉంటే, హైదరాబాద్‌ లో మాత్రం, 10 గంటలకు మూసేస్తున్నారని ఆగ్రహించారు. రాత్రి 10 గంటలు దాటితే, సైరన్‌ తో వచ్చి, పోలీసులు నాన రచ్చ చేస్తున్నారు. ఈ అనుభవం నాకు కూడా ఎదురైందని దీనిపై స్పందించాలని సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ లను కోరారు ఆర్జీవీ. అసలు తెలంగాణ, హైదరాబాద్‌ లో తాలిబన్ల పాలన నడుస్తుందా అని నిలదీశారు. పబ్‌ కల్చర్‌ పై ఎలాగైనా సీఎం కేసీఆర్‌ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ట్వీట్‌ చేశారు వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news