త్వరలోనే గిరిజన బంధు పథకం అమలు – కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

-

త్వరలోనే గిరిజన బంధు పథకం అమలు చేస్తామని ప్రకటించారు మునుగోడు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. మునుగోడు కష్టాలు తీర్చింది టీఆర్ఎస్.. తీర్చబోయేది టీఆర్ఎస్ మాత్రమేన్నారు. ఈ రోజు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సంస్థాన్ నారాయణ పురం మండలంలోని రాచకొండ గ్రామంలో.. కడీలభాయి తండాలో మరియు తుంబాయి తండాలో, వెంకంభాయి తండాలలో జోరుగా ప్రచారం నిర్వహించారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.

ఈ సందర్భంగా..టీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ గారు ఆశీర్వదించి నాకు ఈ అవకాశం ఇచ్చారు.అందుకే మీ దీవెనలకోసం వచ్చాను… సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులలో దేశంలో తెలంగాణతో పోటీ పడగలిగే రాష్ట్రం మరొకటి లేదన్నారు. సంక్షేమంలో దేశంలో నెంబర్ వన్ స్థానంలో మనమే ఉన్నాము… దశాబ్దాల పాటు ఫ్లోరైడ్ సమస్యతో ఈ ప్రాంతం మూడు తరాలను నష్టపోయిందని పేర్కొన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో స్వయంగా ఇక్కడ తిరిగి ఫ్లోరైడ్ సమస్యపై పాటలు రాశారు. 2014లో అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఫ్లోరైడ్ ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా రక్షిత తాగునీరు అందించడం జరిగిందని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మూలంగానే ఇది సాధ్యమయిందని వెల్లడించారు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news