చికెన్‌ బిర్యానీ ఇవ్వలేదని రెస్టారెంట్‌ను తగలబెట్టేశాడు.. కానీ సీసీ కెమెరాలకు చిక్కడంతో..

-

సాంబర్‌ టెస్టీగా చేయలేదని తల్లిని, చెల్లిని చంపిన అన్న..ఈ మధ్యనే జరిగిందీ ఈ ఘటన.. జనాలు మరీ ఇంత క్రూరంగా ఎందుకు మారుతున్నారో కదా..! రెస్టారెంట్ సిబ్బంది చికెన్‌ బిర్యాని ఇవ్వలేదనే కోపంతో ఓ వ్యక్తి ఏకంగా ఆ రెస్టారెంట్‌కే నిప్పు పెట్టాడు. గుట్టుగా చేద్దాం అని స్కెచ్‌ మరీ..అర్థరాత్రి వచ్చి నిప్పుపెట్టాడు. కానీ నిఘానేత్రాలకు చిక్కడంతో పోలీసులు అతన్ని పట్టుకుని జైల్లో పడేశారు. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిందితుడు చోఫెల్( 49) నగరంలోని జాక్సన్ హైట్స్ ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశీ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తినడానికి వచ్చాడని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అతను తాగిన మైకంలో ఉన్నందున రెస్టారెంట్ సిబ్బంది తనకు చికెన్ బిర్యానీ ఇవ్వలేదట.. అసహనంతో రగిలిపోయిన చోఫెల్‌ కోపంతో.. రెస్టారెంట్ యజమానికి గుణపాఠం చెప్పాలని తర్వాత రోజు రాత్రి రెస్టారెంట్‌కు వచ్చి నిప్పు పెట్టాడు.

తెల్లారి యజమాని వచ్చి హోటల్ చూసే సరికి పొగ కనిపించింది. ఏం జరిగిందో అని కంగారు పడ్డాడు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి చోఫెల్‌గా గుర్తించారు. అతన్ని అరెస్టు చేశారు. బిర్యాని ఇవ్వలేదని రెస్టారెంట్‌కు నిప్పు పెట్టిన ఆ వ్యక్తి ఇప్పుడు జైల్లో ఖైదీల ఫుడ్ తింటున్నాడు.

ఈ మొత్తం సంఘటన రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవడంతో అది కాస్తా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. ఈ వీడియోలో నిందితుడు నిప్పు పెట్టడం చూడవచ్చు. ఆ హోటల్‌ వాడు ఇవ్వకపోతే వేరే హోటల్‌కు పోవాలి.. లేకపోతే ఆర్డర్‌ పెట్టుకుని తినాలి..అంతేకానీ ఇలా తిక్కపనలు చేయడం ఏంటని నెటిజన్లు కమెంట్‌ చేస్తున్నారు. బిర్యాని కోసం పోతే..ఇప్పుడు జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని మరికొంతమంది అంటున్నారు. అయితే హోటల్‌కు నిప్పుపెట్టటం వల్ల ఎంత మేర నష్ట వాటిల్లింది అనేది చెప్పలేదు. కానీ ఇలా పగబట్టి ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీయడం మాత్రం క్షమించరాని నేరం..!

Read more RELATED
Recommended to you

Latest news