కోమటిరెడ్డి బ్రదర్స్‌ కోవర్ట్‌ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ : కంచర్ల భూపాల్ రెడ్డి

-

తెలంగాణలో మునుగోడు మేనియా నడుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయం అంతా ఆ నియోజకవర్గం చుట్టే తిరుగుతోంది. అయితే.. తాజాగా.. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ నిలకడ లేని వ్యక్తులని, అన్నదమ్ములిద్దరూ కోవర్ట్‌ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అని విమర్శించారు. మంగళవారం మునుగోడు మండలంలోని గూడపూర్ లో ఇంటింటికి వెళ్లిఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజకీయ స్వార్థం తప్ప ప్రజల సమస్యలు పట్టని రాజగోపాల్ రెడ్డినిఎన్నికల్లో ఓడిస్తేనే మునుగోడు అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు కంచర్ల భూపాల్ రెడ్డి. రాష్ట్రంలోని నియోజకవర్గాల అభివృద్ధిని చూస్తే ఆనందం కలుగుతుందని మునుగోడు దీనస్థితిని చూస్తే బాధేస్తుందన్నారు కంచర్ల భూపాల్ రెడ్డి.

Reach your goal with effort: MLA Bhupal Reddy

దీనికి కారణమైన రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజల ఉసురు తగులుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అమలు చేస్తున్న పథకాలు గడపగడపకు అందుతున్నాయని పేర్కొన్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు, హరితహారం మొక్కలతో పల్లెలు కొత్త శోభను సంతరించుకున్నాయని వెల్లడించారు కంచర్ల భూపాల్ రెడ్డి. తెలంగాణ మాదిరిగా దేశాన్ని కూడా అభివృద్ధి చేయాలని తపనతో ఉన్న సీఎం కేసీఆర్ కు మునుగోడు నుంచి బలం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు కంచర్ల భూపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news