బండి సంజయ్ అమిత్ షాతో కూడా ప్రమాణం చేయిస్తారా : జగదీశ్‌ రెడ్డి

-

మొయినాబాద్‌ ఎమ్మెల్యే కొనుగోలు ఘటనతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయం భగ్గుమంది. అయితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.100 కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రలోభపెట్టినట్టు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ యాదాద్రిలో తడిబట్టలతో ప్రమాణం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలంగాణ స్పందించారు మంత్రి జగదీశ్ రెడ్డి. గుళ్లో ప్రమాణం చేయమని బండి సంజయ్ ని ఎవరడిగారని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే బీజేపీ వాళ్లు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని జగదీశ్ రెడ్డి విమర్శించారు. “మునుగోడు గడ్డపై అమిత్ షా చెప్పిన మాటలను నిజం చేసే ప్రయత్నంలో అడ్డంగా బుక్ అయ్యారు.

Komatireddy brothers flayed for 'cheap tricks' says Minister G Jagadish  Reddy

బండి సంజయ్ ఇప్పుడు అమిత్ షాతో కూడా ప్రమాణం చేయిస్తారా?” అంటూ మంత్రి జగదీశ్ రెడ్డి నిలదీశారు. బీజేపీ కుట్రలను తమ పార్టీ ఎమ్మెల్యేలు బట్టబయలు చేశారని, దొంగలను విజయవంతంగా పట్టుకున్నారని వెల్లడించారు. బండి సంజయ్ బొక్కబోర్లాపడ్డారని మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. మొయినాబాద్ ఫాంహౌస్ లో ప్రలోభాలపై వాస్తవాలు బయటికి వస్తున్నాయని, బీజేపీ నేతలు దోషులు అయ్యారని జగదీశ్ రెడ్డి వివరించారు. దీనిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు జగదీశ్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news