టీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌..కార్యకర్తలతో తుమ్మల రహస్య సమావేశం !

-

టీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగులనుందా.. ? తాజాగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్న కార్యక్రమాలు ఆ ప్రచారానికే అద్దం పడుతోంది. ఇవాళ ములుగు జిల్లా వాజేడులో అభిమానులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ఆత్మీయ సమ్మేళనం చేపట్టనున్నారు.

ఇందులో భాగంగానే తుమ్మల స్వగ్రామమైన గండుగులపల్లి నుంచి వాజేడు కి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధం లేకుండానే.. ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తుమ్మల.

గండుగులపల్లి నుంచి భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల, వెంకటాపురం మండలాల మీదుగా వాజేడుకి సుమారు 300 వాహనాలతో భారీ కాన్వాయ్‌ తో రానున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుమ్మల అనుచరులు భారీ గా తరలి వచ్చే అవకాశం ఉంది. తుమ్మల రాజకీయంగా ఏమైన నిర్ణయం పై తీసుకుంటారా అన్న పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక అటు తుమ్మల ఆత్మీయ సమ్మేళనంపై ఇంటెలిజన్స్ వర్గాలు నిఘా పెట్టాయి.

Read more RELATED
Recommended to you

Latest news