హైదరాబాద్ లో టిప్పర్ బీభత్సం.. 6 వాహనాలు ధ్వంసం, ఒకరు మృతి

-

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలి అర్ధరాత్రి ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. సిగ్నల్ పడటంతో ఆగిన వాహనాలపైకి వెనుక నుంచి ఆ వాహనం దూసుకు వచ్చింది. టిప్పర్ వేగానికి ఏకంగా నాలుగు కార్లు మరియు రెండు బైకులు నుజ్జు నుజ్జు అయ్యాయి.

ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక అక్కడే ఉన్న స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అటు రంగంలోకి దిగిన పోలీసులు వాహనం నడిపిన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. బ్రేకులు సరిగా పడకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news