ఏపీలో ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాల్సిoదే – సీఎం జగన్

-

 

ఏపీలో ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాల్సిoదేనని అదేశించారు ఏపీ సీఎం జగన్. వైద్య,ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ,కోవిడ్‌ చికిత్స, నివారణ చర్యల్లో విలేజ్‌ క్లినిక్‌లు కేంద్రంగా చికిత్స అందాలన్నారు.

 

టెస్టింగ్, మెడికేషన్‌ విలేజ్‌ క్లినిక్‌ కేంద్రంగా జరగాలి, ఏఎన్‌ఏం, ఆశావర్కర్లు అందరూ విలేజ్‌ క్లినిక్‌ల కేంద్రంగా అందుబాటులో ఉండాలి, పీహీచ్‌సీల పర్యవేక్షణలో విలేజ్‌ క్లినిక్‌లు పని చేయాలని ఆదేశించారు సీఎం జగన్‌.

 

మాస్క్ ధరించడంతో పాటు కోవిడ్‌ నివారణ చర్యలపై అవగాహన కలిగించాలి, అనుమానాస్పదంగా ఉన్న కేసుల్లో తప్పనిసరిగా పరీక్ష నిర్వహించాలి, ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలపై మరోసారి విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news