BIG BREAKING : చంద్రబాబు కందుకూరు పర్యటనలో అపశ్రుతి..

-

నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా ఏపీలో టీడీపీ జెండా ఎగరవేయాలని భావిస్తున్న చంద్రబాబు అన్ని జిల్లాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లి అక్కడి శ్రేణులను కాస్త ఉత్తేజపరిచి వెనక్కి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు కోస్తా జిల్లాల మీద దృష్టి పెట్టారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో ఒక చంద్రబాబు అధ్యక్షతన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో అపశృతి చోటు చేసుకుంది. బహిరంగ సభ దగ్గర తొక్కిసలాట ఏర్పడడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Andhra Pradesh: TDP Chief Chandrababu Naidu Gets Centre's Invite For  Crucial Meet

వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట జరగడంతో వెంటనే పక్కనే ఉన్న కాలువలో పలువురు కార్యకర్తలు పడిపోయారని తెలుస్తోంది. అలా పడిపోయిన వారికి గాయాలు కాగా ఏడుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం సాయంత్రం చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు షెడ్యూల్ ప్రకారం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news