మతతత్వ బిజెపి పట్ల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలి – హరీష్ రావు

-

సీఎం కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నారని అన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ వచ్చిన తర్వాత రిజర్వేషన్లు 6 శాతం నుంచి 10 శాతానికి పెరిగాయన్నారు. 81 వేల ఉద్యోగ నియమాకాల్లోనూ 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ ఆత్మగౌరవ భవనానికి ఎకరం స్థలం, 23 కోట్లు ఇచ్చారన్నారు.

తెలంగాణ వచ్చాక 75 గిరిజన కళాశాలలు ఇచ్చామన్నారు. గిరిజనులను ఇతర పార్టీలు ఓటు బ్యాంకుగా చూసారని అన్నారు. దేశంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో 2, 471 తాండలను గ్రామపంచాయతీలుగా చేశామన్నారు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.

గిరిజన యూనివర్సిటీ నిర్మాణం కోసం స్థలం రెడీగా ఉందన్నారు. లాంబాడాలకు రిజర్వేషన్లు తొలగించాలని రాష్ట్రానికి చెందిన ఓ ఎంపీ కోరుతున్నారని తెలిపారు. మతతత్వ బిజెపి పట్ల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలన్నారు హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి ప్రభుత్వం అమ్మడం దారుణం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news