మహిళలకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం,వెండి ధరలు

-

 

బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. బంగారం భారీగా పెరుగుతోంది.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 210 పెరిగి, రూ. 56, 950 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 190 పెరిగి, రూ. 52, 200 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1800 పెరిగి, రూ. 75, 800 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news