బెంగళూరు మెట్రోలో పెళ్లికూతురు.. వీడియో వైరల్

-

రోజురోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్​ భారీగా ఏర్పడుతోంది. ఈ ట్రాఫిక్ జామ్ సమస్యకు చెక్ పెట్టడానికి మెట్రో నగరాల్లో మెట్రో రైల్వే సర్వీసులు నడుపుతున్నారు. చాలా మంది ప్రయాణికులు సొంత వాహనాలున్నా సరే ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి.. టైం ఆదా అవుతుందని మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్​లో చిక్కుకుపోయినప్పుడు.. తప్పదు అనిపిస్తే ఇక మెట్రో వైపు పరుగులు పెడతున్నారు. బెంగళూరులో ఓ పెళ్లి కూతురు కూడా ఇలానే చేసింది.

కల్యాణ మండపానికి కారులో బయలుదేరిన ఓ వధువు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ముహూర్తం సమయానికి కల్యాణ వేదిక వద్దకు చేరుకోవాలని ఆమె వెంటనే మెట్రో రైలును ఆశ్రయించారు. పెళ్లి కుమార్తె ముస్తాబులో ఉన్న ఆ యువతి మెట్రోలో ప్రయాణిస్తుండగా ఓ ఔత్సాహికుడు వీడియో తీసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు.

అంతే.. కర్ణాటకలో ఆ వీడియో వైరల్‌గా మారింది. ‘వాట్ ఏ బ్రైడ్‌’ పేరిట పెట్టిన వీడియోను కొద్ది గంటల్లోనే 8వేల మంది వీక్షించారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకొని నెటిజన్లు స్పందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news