బీజేపీలో బండి సంజయ్ అధ్యక్ష మార్పు ఉండదు – విజయశాంతి

-

బీజేపీలో బండి సంజయ్ అధ్యక్ష మార్పు ఉండదన్నారు విజయశాంతి. తెలంగాణలో మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి నేతృత్వంలోనే బీజేపీ ఎన్నికలకు వెళుతుందని నేను గతంలో ఎన్నోసార్లు తెలిపిన విషయాన్నే మా ముఖ్యనేతలు పదే పదే ధృవీకరిస్తున్నప్పటికీ… ఈ అంశంలో అయోమయం సృష్టించేందుకు, చివరికి మీడియాని కూడా తప్పుదారి పట్టించేందుకు నానా తంటాలు పడుతూ వస్తున్న ఇతర పార్టీల నాయకులను దృష్టిలో ఉంచుకుని, తాజా పరిణామం ద్వారా మరోసారి తెలియజేస్తున్నానని వెల్లడించారు.

 

కొద్ది రోజుల కిందటే మన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిగారు ఈ విషయమై మీడియా ద్వారా స్పష్టత ఇచ్చినప్పటికీ… తాజాగా ఒక మీడియా మిత్రుడు సంజయ్ గారి అధ్యక్ష పదవి గురించి మా పార్టీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారిని ప్రశ్నిస్తే ఆయన కూడా ఎంతో స్పష్టంగా మళ్లీ బదులిచ్చారు.ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీగారు సంజయ్ గారి ప్రజా సంగ్రామ యాత్రను ప్రశంసించడాన్ని లక్ష్మణ్ గారు గుర్తు చేస్తూ ప్రధాని ఇచ్చిన కితాబే సంజయ్ గారి కొనసాగింపునకు సంకేతమని తేల్చి చెప్పారు. సందిగ్ధతలు బీజేపీలో ఎన్నడూ ఉండవు. కేసీఆర్ గారి కుయుక్తుల ప్రచారాలు ఇక్కడ చెల్లవని ఫైర్ అయ్యారు.

 

జాతీయవాదులు, హిందూ బంధువులు, మన బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఒక శివాజీ మహరాజ్ ప్రతిరూపపు ఆవేశంతో, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో బండి సంజయ్ గారి అధ్యక్షతన రాబోయే ఎన్నికల రణక్షేత్రానికి ఇప్పటి నుండే అనుక్షణం సైనికులై పనిచేసే సందర్భం ఆసన్నమైంది.అడుగడుగునా కలిసి నడుద్దాం… ప్రతి ప్రజా సమస్యపై పోరాడుదాం… బీజేపీ రాజ్యం తెలంగాణలో సాకారం చేద్దామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news