Breaking : ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. కండక్టర్‌ మృతి

-

జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ఘటనలో కండక్టర్ మృతిచెందాడు. బస్సు డ్రైవర్ తో సహా ఐదుగురు ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొండగట్టు -దొంగల మర్రి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ కు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. తెల్లవారు జామున ఈప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. రోడ్డుపై లారీ, బస్సులు ముందు భాగాలు తునాతునకలు అయ్యాయి. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ మద్యం సేవించి లారీ నడిపాడా? లేక బస్సు డ్రైవర్‌ నిద్రలో ఉండటం వలన ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news