వేములవాడ ప్రజలు కేసీఆర్​ను మరిచిపోలేరు : బండి సంజయ్

-

వేములవాడ ప్రజలు కేసీఆర్​ను మరిచిపోలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు శివున్ని మర్చిపోలేరని… అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్​ను కూడా ఈ ప్రాంత ప్రజలు మర్చిపోలేరని మండిపడ్డారు. ఎందుకంటే యాదాద్రి అభివృద్ధి చేసినట్లే.. వేములవాడను కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి మర్చిపోయారని విమర్శించారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలం అయ్యిందని ధ్వజమెత్తారు.

మహాశివరాత్రి జాతర సందర్భంగా రాజరాజేశ్వర స్వామి వారిని బండి సంజయ్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం బండి సంజయ్ సీఎం కేసీఆర్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “సాక్షాత్తు ఆ పరమశివుని సన్నిధిలో అడుగుతున్నా.. నీ బిడ్డ పేరు దొంగ సారా దందాలో నాలుగుసార్లు వచ్చిందని.. మరి ఎందుకు నోరు విప్పడం లేదు” అని ప్రశ్నించారు.

“వేములవాడ అభివృద్ధికి సీఎం కేసీఆర్​ ఇప్పటి వరకు ఎంత కేటాయించారో చెప్పాలి. వేములవాడ దేవాలయానికి సీఎం రూ.50కోట్లు అడిగితే డబ్బులు ఇవ్వడం లేదు. ఇవాళ శివరాత్రి జాతరలో పేదవాళ్లకు కనీస సౌకర్యాలు కూడా ఈ ప్రభుత్వం కల్పించలేదు.”   – బండి సంజయ్​, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Read more RELATED
Recommended to you

Latest news